హైదరాబాద్ / అమరావతి: కార్పొరేట్లు, వ్యాపారుల ప్రయోజనాలకు పెద్దపీట వేసే రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పట్టించుకోవాల్సి వచ్చే సరికి నిబంధనల సాకుతో మొహం చాటేయడం మొదటి నుంచి జరుగుతున్న ప్రక్రియగానే ఉన్నది. అందునా వాణిజ్య పంట మిర్చి పండించిన రైతుల బాధలు చెప్పనలవి కాదంటే అతిశేయోక్తి కాదు.
గత ఏడాది క్వింటాల్ మిర్చి ధర రూ. 12 వేలు పలకడం చూసిన రైతు ఆశ పడ్డాడు. ఒక్క ఏడాది దిగుబడి బాగా వస్తే తన కష్టాలు తీరిపోతాయని కలలు కన్నాడు. వాతావరణం కూడా అనుకూలించడంతో దిగుబడి బాగానే వచ్చినా.. మార్కెట్ యార్డుల్లో వ్యాపారుల 'కళ్లు' మండాయి. ఈ పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నెలకొన్నది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మిర్చి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ పనీ చేయలేదు. కాకపోతే భారమంతా కేంద్ర ప్రభుత్వంపైనే వేసింది.
గమ్మత్తేమిటంటే మిర్చితోపాటు ప్రజలు ప్రతిరోజు వంటల్లో వాడే 'ఉల్లి' భారీగా దిగుబడి రావడంతో గతేడాది ప్రభుత్వమే.. ప్రత్యేకించి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీర్ హరీశ్ రావు ప్రత్యేక శ్రద్ధ, చొరవతో మార్కెటింగ్ శాఖ అధికారులు కిలో ఉల్లికి రూ.8 చొప్పున ధర చెల్లించి కొనుగోలు చేశారు.
గత ఏడాది క్వింటాల్ మిర్చి ధర రూ. 12 వేలు పలకడం చూసిన రైతు ఆశ పడ్డాడు. ఒక్క ఏడాది దిగుబడి బాగా వస్తే తన కష్టాలు తీరిపోతాయని కలలు కన్నాడు. వాతావరణం కూడా అనుకూలించడంతో దిగుబడి బాగానే వచ్చినా.. మార్కెట్ యార్డుల్లో వ్యాపారుల 'కళ్లు' మండాయి. ఈ పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నెలకొన్నది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మిర్చి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ పనీ చేయలేదు. కాకపోతే భారమంతా కేంద్ర ప్రభుత్వంపైనే వేసింది.
గమ్మత్తేమిటంటే మిర్చితోపాటు ప్రజలు ప్రతిరోజు వంటల్లో వాడే 'ఉల్లి' భారీగా దిగుబడి రావడంతో గతేడాది ప్రభుత్వమే.. ప్రత్యేకించి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీర్ హరీశ్ రావు ప్రత్యేక శ్రద్ధ, చొరవతో మార్కెటింగ్ శాఖ అధికారులు కిలో ఉల్లికి రూ.8 చొప్పున ధర చెల్లించి కొనుగోలు చేశారు.

Comments
Post a Comment